GDWL: శిక్షణ పూర్తి చేసుకున్న లైసెన్స్డ్ సర్వేయర్లు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో 69 మంది అభ్యర్థులకు ఆయన లైసెన్స్ పత్రాలను పంపిణీ చేశారు. వీరు ప్రైవేటు భూములతో పాటు, నక్ష లేని గ్రామాల్లో కూడా సర్వే నిర్వహించేందుకు అర్హులని ఈ సందర్భంగా కలెక్టర్ స్పష్టం చేశారు.