NRML: లక్ష్మణచందా మండల కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు బుధవారం, వీడ్కోలు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. విద్యార్థులంతా బోర్డు పరీక్షలు చక్కగా రాసి, మంచి మార్కులు తెచ్చుకోవాలన్నారు. జీవితంలో గొప్ప స్థానంలో నిలవాలని తెలిపారు.