NTR: గంపలగూడెం మండలం కనుమూరు గ్రామంలో అత్తునూరి నాగలక్ష్మికి రూ. 47 వేలు, కొమ్ము రాజేష్ కి రూ.50 వేలు విలువ గల CMRF చెక్కులను లబ్ధిదారులకు వారి ఇంటి వద్ద ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు బుధవారం అందజేశారు. అలాగే వారి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. నిధులు మంజూరు చేయించినందుకు లబ్ధిదారులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.