WNP: కొత్తకోట మండలం వడ్డెవాట తండాకు చెందిన పాత్లావత్ ఠాగూర్ నాయక్కు ఇందిరమ్మ ఇంటి మంజూరు పత్రాన్ని ఎమ్మెల్యే జీ.మధుసూదన్ రెడ్డి బుధవారం అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని, రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు, సర్పంచ్ రాంలాల్ నాయక్ పాల్గొన్నారు.