కృష్ణా: గుడివాడ మార్కెట్ సెంటర్లోని ఘంటసాల నాగభూషణ్ అన్నదాన సత్రం ఆధ్వర్యంలో 50 మంది పేద విద్యార్థులకు ఒక్కొక్కరికి 2000 చొప్పున రూ. లక్ష స్కాలర్షిప్ నగదును ఎమ్మెల్యే వెనిగండ్ల రాము బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దశాబ్దాలుగా ప్రాముఖ్యత గాంచిన గుడులకే కాకుండా, సేవా తత్పరులకు నిలయంగా గుడివాడ నిలిచిందని పేర్కొన్నారు.