NZB: నిజామాబాద్ జిల్లాలో అనుమతులు లేకుండా మొరం, ఇసుక తవ్వకాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. నందిపేట పలుగుట్ట ప్రాంతంలో అక్రమ తవ్వకాలు నిర్వహిస్తున్న వారిపై సీసీఎస్ పోలీసులు దాడి చేసి మూడు టిప్పర్లు, రెండు జెసిబీలు, ఒక ట్రాక్టర్ను స్వాధీనం చేసుకున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.