PDPL: జిల్లాలో వేసవికాలం తాగునీటి సమస్య నివారణకు మంత్రి శ్రీధర్ బాబు, తాను నిధులు సమకూరుస్తామని మంత్రి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. ఇవాళ ఆయన ప్రజా ప్రతినిధులకు ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ అమలుపై స్థానిక సంస్థల ప్రతినిధులకు నిర్వహించిన అవగాహన శిబిరంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 99 రోజుల కార్యాచరణలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.