SDPT: యుద్ధాల సాకుతో కేంద్ర ప్రభుత్వం వంటగ్యాస్ ధరల పెంపును విరమించుకోవాలని సీపీఐ సిద్దిపేట జిల్లా కార్యవర్గ సభ్యులు అందే అశోక్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ధరలు పెంచడాన్ని నిరసిస్తూ బుధవారం సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో చేర్యాల మండల కేంద్రంలోని అంగడి బజార్ వద్ద జాతీయ రహదారిపై ఖాళీ గ్యాస్ సిలిండర్తో ఆందోళన నిర్వహించారు. ఇందులో స్థానికులు పాల్గొన్నారు.