JGL: ఈనెల 14వ తేదీ నుంచి ప్రారంభంకానున్న పదో తరగతి పరీక్షలకు ఇబ్రహీంపట్నం మోడల్ స్కూల్, గోదూర్ ఉన్నత పాఠశాలలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఎంఈవో మధు తెలిపారు. మండలంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, మోడల్ స్కూల్, కస్తూరిబాలో కలిపి మొత్తం 304 మంది పదో తరగతి విద్యార్థులు ఉన్నారని పేర్కొన్నారు. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహిస్తామన్నారు.