MDK: మెదక్ పార్లమెంట్ పరిధిలోని పలు అభివృద్ధి పనుల కోసం ఎంపీ రఘునందన్ రావు రూ.2.4 కోట్ల ఎంపీ లాడ్స్ నిధులు కేటాయించారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డమ్ మల్లేష్ గౌడ్ తెలిపారు. బుధవారం నర్సాపూర్లో ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో అంగన్వాడీలు, మహిళా భవనాలు, పాఠశాల ప్రహరీ గోడలు, బోర్ల ఏర్పాటు కోసం ఈ నిధులు మంజూరయ్యాయని పేర్కొన్నారు.