MNCL: మంచిర్యాలలోని దుర్గామాత దేవాలయంలో మంగళవారం బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో మహా హారతి కార్యక్రమం నిర్వహించారు. ఈ నెల 10న హైదారాబాద్ లో దేశ ప్రధాని నరేంద్ర మోడీ సభ విజయవంతం కావాలని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బీజేపీ పట్టణ అధ్యక్షుడు రాజ్ కుమార్ మాట్లాడుతూ దేశ అభివృద్ధికి ప్రధాని మోడీ చేస్తున్న కృషికి ప్రజల నుంచి ఆదరణ వస్తోందని తెలిపారు.