JN: రైతు భరోసా నిధులు రాకపోవడంతో జిల్లా రైతులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. సరైన సమయానికి పెట్టుబడి సహాయం అందలేదని వాపోతున్నారు. గత ప్రభుత్వంలో సమయానికి రైతు బంధు పడేదని, ప్రభుత్వం మారిన తర్వాత చాలా ఇబ్బంది అవుతుందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పట్టించుకుని వెంటనే రైతు భరోసా నిధులు విడుదల చేయాలన్నారు.