కలబంద ముఖంపై మొటిమలు, మచ్చలను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. కలబంద గుజ్జు, పసుపు, రోజ్వాటర్, శెనగపిండి కలిపి పేస్ట్లా చేసి ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగితే మంచి ఫలితం ఉంటుంది. అలాగే కలబందలో తేనె, పసుపు కలిపి రాస్తే చర్మం శుభ్రపడి వాపు తగ్గుతుంది. జిడ్డు చర్మం వారు నిమ్మరసం కలిపి వాడితే ముఖం కాంతివంతంగా మారుతుంది.