బాలీవుడ్ లెజెండరీ నటి మధుబాల బయోపిక్కు రంగం సిద్ధమైంది. సంజయ్లీలా భన్సాలీ నిర్మాణంలో జస్మిత్ కె. రీన్ ఈ మూవీని తెరకెక్కించనున్నాడట. మధుబాల పాత్రలో కియారా అద్వానీ నటించనున్నట్లు వార్తలు రాగా.. అందులో నిజం లేదని టీం క్లారిటీ ఇచ్చారట. తాజాగా ఈ మూవీలో నటి అనీత్ పడ్డా భాగం కానున్నట్లు టాక్ నడుస్తోంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు సమాచారం.