KMM: నేలకొండపల్లి వ్యవసాయ మార్కెట్లోని గోడౌన్లను రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ రాయల నాగేశ్వరరావు ఆకస్మికంగా బుధవారం తనిఖీ చేశారు. గోడౌన్లలో నిల్వ చేస్తున్న సన్న బియ్యాన్ని పరిశీలించి వాటి నాణ్యతను, రేషన్ దుకాణాలకు సరఫరా చేయాల్సిన బియ్యం సరిగ్గా ఉందా లేదా అని తనిఖి చేశారు. బియ్యం నిల్వల్లో జాగ్రత్తలు పాటించాలని సూచించారు.