SRPT: ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని మున్సిపల్ ఛైర్మన్ సంకేపల్లి రఘునందన్ రెడ్డి అన్నారు. బుధవారం తిరుమలగిరిలోని మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా కౌన్సిలర్లతో కలిసి మొక్కలు నాటి మాట్లాడారు. మొక్కలు మానవ మనుగడకు జీవనాధారం అన్నారు. నాటిన మొక్కలను రక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.