ప్రకాశం: ప్రభుత్వ పథకాల పట్ల ప్రజల్లో అవగాహన పెంచాలని సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులకు ఆదేశించారు. బుధవారం మార్కాపురం ఆర్డీవో కార్యాలయంలో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ మీటింగ్ లో జేసి శ్రీనివాసులు, ఇతర జిల్లా అధికారులు హాజరయ్యారు. ఈ నెల 13న అన్నదాత సుఖీభవ పథకం మూడో విడత అమలు చేస్తున్నట్లు, కేంద్ర నిధులతో పాటు రాష్ట్రం ఇస్తుందన్నారు.