సీనియర్ నటి రాధికా శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన ‘తాయి కిళవి’ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. కేవలం రూ. 9కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ. 51.16కోట్లు వసూలు చేసింది. ‘పవునుత్తాయి’ అనే మాస్ పాత్రలో రాధికా నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇదే ఊపు కొనసాగితే త్వరలోనే రూ. 100 కోట్ల క్లబ్లో చేరడం ఖాయం.