BDK: జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ను ఎమ్మెల్యేలు జారే ఆదినారాయణ, తెల్లం వెంకటరావు, గ్రంథాలయ ఛైర్మన్ పసుపులేటి వీరబాబు శుక్రవారం పాల్వంచలో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం జిల్లాలోని పలు సమస్యలపై చర్చించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజలకు సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అందుతున్నట్లు పేర్కొన్నారు.
NGKL: అమ్రాబాద్ మండలంలోని నల్లమల అడవి ప్రాంతంలోని రాయల గండిలో ప్రసిద్ధిగాంచిన శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయాన్ని క్రీ.శ 1536లో చింతగుండ రంగారావు నిర్మించారు. ఈ ప్రాంతానికి రంగా రయుని గండి అని పేరు పెట్టగా కాలక్రమేన అది “రాయలగండి” గా ప్రసిద్ధి చెందింది. ఈ చెన్నకేశవ స్వామి ఆలయంలో మాల దాసరి వర్గానికి చెందిన వారు పూజలు నిర్వహించడం విశేషం.
SRPT: మేళ్లచెరువు మండలంలో జాతర సందర్భంగా నిర్వహించిన రాష్ట్రస్థాయి కబడ్డీ టోర్నమెంట్ ఉత్కంఠ భరితంగా ముగిసింది. ఫైనల్ పోరులో విజయనగరం, వైజాగ్ జట్లు తలపడగా, విజయనగరం జట్టు విజేతగా నిలిచి లక్ష రూపాయల నగదు బహుమతిని కైవసం చేసుకుంది. విజేతకు ట్రోఫీని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. క్రీడల్లో గెలుపు ఓటములు సహజమన్నారు.
JN: జనగామ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ను మున్సిపల్ ఛైర్పర్సన్ కడకంచి బాలమణి కలిశారు. కాంగ్రెస్ కౌన్సిలర్లతో కలిసి వెళ్లిన ఆమె, పట్టణ అభివృద్ధికి సహకరించాలని కలెక్టర్ను కోరారు. అనంతరం డీసీపీ రాజమహేంద్ర నాయక్, అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్, ఆర్డీవో గోపీరాంలను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్ శివరాజ్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.
BHNG: జిల్లాలోని విద్యారంగ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం టీచర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా స్టీరింగ్ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్కి వివిధ సమస్యలపై గురువారం వినతి పత్రం అందజేశారు. భువనగిరి మున్సిపల్ పరిధి నుండి 8 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి కార్యాలయాలలో పనిచేస్తున్నా వారికి 13 శాతం హెచ్ఆర్ఏ ఇవ్వాలని అన్నారు.
PDPL: పత్తి రైతులు ఆందోళన చెందవద్దని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తెలిపారు. ఇవాళ పత్తి కొనుగోళ్లు ముగించాలని అధికారులు భావించగా, రైతుల ప్రయోజనాల దృష్ట్యా ఈ గడువును మార్చి 15 వరకు పొడిగించాలని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సీఎండీని కోరినట్లు చెప్పారు. ఈ మేరకు కోటపల్లి ప్రాంత పత్తి రైతులు సమస్యలు పరిష్కరిస్తామన్నారు.
ADB: అర్హులైన జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర సమాచార అండ్ ప్రజా సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ ప్రియాంక తెలిపినట్లు ఆదిలాబాద్ ఇంఛార్జ్ DPRO విష్ణువర్ధన్ తెలిపారు. దరఖాస్తు జారీ ప్రక్రియ రోలింగ్ ప్రాతిపదికన కొనసాగుతుందన్నారు. దరఖాస్తు దారులు ipr.telangana.gov.in వెబ్సైట్ను సంప్రదించాలన్నారు.
JGL: మల్యాల మండలం తాటిపల్లిలో తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం కరీంనగర్, మండల వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో గ్రామ రైతులకు నువ్వుల పంట సాగుపై అవగాహన, శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. నువ్వుల సాగులో సరైన మోతాదులో ఎరువుల రకాలను సరైన సమయంలో వాడటం వలన ఉత్తమ ఫలితాలను సాధించవచ్చని శాస్త్రవేత్త హరికృష్ణ రైతులకు తగు సూచనలు, సలహాలు చేశారు.
MBNR: జడ్చర్ల మండలంలోని పోలేపల్లి గ్రామంలో నిర్వహించిన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించి, నివాళులర్పించారు. శివాజీ మహారాజ్ దేశభక్తి, ధైర్యసహసాలు, పరిపాలనా నైపుణ్యం, నేటి యువతకు ఆదర్శమని ఎమ్మెల్యే అన్నారు. శివాజీ మహారాజ్ సేవలు చిరస్మరణీయమని అన్నారు.
MDCL: పార్కులు ప్రజల ఉమ్మడి ఆస్తి అని వీటిని కొనుగోలు చేయడం, విక్రయించడం రెండు చట్ట విరుద్ధమని నాచారం పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ధనుంజయ తెలిపారు. మల్లాపూర్లోని బాబానగర్ కో-ఆపరేటింగ్ హౌసింగ్ సొసైటీ పరిధిలో ప్రజల వినియోగానికి కేటాయించిన పార్కు స్థలాలను కబ్జా చేసిన బొట్ల సాయిలు అనే ప్రధాన నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
వనపర్తి మున్సిపల్ ఆఫీసులో నేడు ఉదయం 10 గంటలకు నూతనంగా ఎన్నికైన ఛైర్మన్ మిడిదొడ్డి మాధవి రమేష్, వైస్ ఛైర్మన్ మధుసూదన్ గౌడ్ పదవి బాధ్యతలను స్వీకరిస్తారని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ బాధ్యులు తిరుపతయ్య తెలిపారు. మున్సిపల్ కౌన్సిలర్లు ఆయా వార్డు నుంచి పార్టీ శ్రేణులు పాల్గొంటారన్నారు. ఇందిరాపార్క్ నుండి ర్యాలీతో మున్సిపల్ ఆఫీస్ కు చేరుకుంటారు అని తెలిపారు.
SRD: జిల్లాను ప్రమాద రహిత జిల్లాగా మార్చేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రోడ్డు భద్రత సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలు జరిగే స్పాట్లను గుర్తించాలని చెప్పారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
కరీంనగర్ పట్టణంలోని పలు ప్రైవేట్ హాస్పిటల్స్, నర్సింగ్ హోమ్లు, అల్ట్రా సౌండ్ కేంద్రాలను డీఎంహెచ్వో అధికారి డాక్టర్ వెంకటరమణ, జిల్లా హాస్పిటల్స్ రిజిస్ట్రేషన్ అథారిటీ తనిఖీ బృంద సభ్యులతో కలిసి నిన్న తనిఖీ చేశారు. జిల్లాలోని అన్ని ప్రైవేటు హాస్పిటల్స్ & నర్సింగ్ హోమ్ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం-2010 ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలని సూచించారు.
పెద్దపల్లి పట్టణంలోని మదర్ తెరిసా ఇంజనీరింగ్ కళాశాలలో గురువారం ధర్మారం, అంతర్గాం, ఎలిగేడు, జూలపల్లి, రామగిరి, ముత్తారం, మంథని మండలాల నూతనంగా ఎన్నికైన సర్పంచులకు రెండో విడత శిక్షణ కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి DPO వీర బుచ్చయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని ఆయన నూతన సర్పంచులకు సూచించారు.
RR: షాద్నగర్ పట్టణ పదవ వార్డు కౌన్సిలర్ శ్రావణిని సీఎస్కే విల్లాస్ డెవలప్మెంట్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో అసోసియేషన్ సభ్యులు అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా వార్డును అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజలతో మమేకమై ఉంటూ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు వెళతానన్నారు.