• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

నీలాద్రిశ్వర స్వామి ఆలయానికి పెరిగిన ఆదాయం

KMM: పెనుబల్లి మండలంలోని నీలాద్రీశ్వరస్వామి ఆలయ మహాశివరాత్రి జాతర ఆదాయం రూ. 31,18,011 వచ్చినట్లు ఈవో రజనీకుమారి తెలిపారు. భక్తుల కానుకల ద్వారా రూ. 11.20 లక్షలు, బహిరంగ వేలం, ఇతర సేవల ద్వారా మిగిలిన ఆదాయం సమకూరింది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఆదాయం రూ. 3,54,245 పెరిగిందని అధికారులు వెల్లడించారు. భక్తుల తాకిడి పెరగడంతో ఆదాయం గణనీయంగా పెరిగిందని ఆమె పేర్కొన్నారు.

February 20, 2026 / 07:42 AM IST

రాష్ట్ర స్థాయి కిక్ బాక్సింగ్ పోటీలకు జనగాం విద్యార్థినులు

JN: జిల్లా తరిగొప్పుల, స్టేషన్ ఘనపూర్ మండలం పల్లగుట్టకు చెందిన విద్యార్థినులు రాష్ట్ర స్థాయి సీఎం కప్ కిక్ బాక్సింగ్ పోటీలకు ఎంపికయ్యారు. జిల్లా స్థాయిలో స్వర్ణ పతకాలు సాధించిన ఈ క్రీడాకారిణులను గురువారం కలెక్టరేట్లో అడిషనల్ కలెక్టర్ పింకేష్ కుమార్, జీసీడీవో గౌసియా బేగం ప్రత్యేకంగా అభినందించారు.

February 20, 2026 / 07:42 AM IST

శివాజీ శోభాయాత్రకు పటిష్ఠ పోలీస్ బందోబస్తు

NRPT: శివాజీ మహారాజ్ శోభాయాత్రకు పటిష్ఠ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ లింగయ్య తెలిపారు. గురువారం నారాయణపేటలో నిర్వహించిన శోభాయాత్రలో పోలీస్ బందోబస్తును పరిశీలించారు. శోభాయాత్ర జరిగే గణేష్ మార్గ్ గుండా పోలీసులను మోహరించినట్లు చెప్పారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.

February 20, 2026 / 07:42 AM IST

ఇసుక ట్రాక్టర్లు సీజ్.. నలుగురిపై కేసు నమోదు

MHBD: నెల్లికుదురు మండలంలోని బ్రాహ్మణ కొత్తపల్లి శివారు ఆకేరు వాగు నుంచి అక్రమంగా తరలిస్తున్న 3 ఇసుక ట్రాక్టర్లను సీజ్ చేసి, నలుగురిపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై చిర్రా రమేష్ బాబు తెలిపారు. ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇసుక తరలించినట్లయితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

February 20, 2026 / 07:38 AM IST

అక్రమంగా తరలిస్తున్న పశువుల వాహనం పట్టివేత

ASF: అక్రమంగా తరలిస్తున్న పశువుల వాహనాన్ని జైనూర్ పోలీసులు పట్టుకున్నారు. జైనూర్ నుంచి పశువులను అక్రమ రవాణా చేస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు జామ్ గాం వద్ద పోలీసులు తనిఖీలు చేసి పశువులను తరలిస్తున్న ఐచర్ వ్యాన్‌ను పట్టుకున్నారు. ఈ దాడిలో 23 పశువులు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై రవి తెలిపారు. పశువులను తరలిస్తున్న ముగ్గురిపై కేసు నమోదు చేసి నట్లు పేర్కొన్నారు.

February 20, 2026 / 07:36 AM IST

‘యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రీడా దుస్తుల పంపిణి’

MHBD: జిల్లా గంగారాం మండలం వెంకమ్మగుంపు గ్రామానికి చెందిన క్రీడాకారులకు శుక్రవారం ఉదయం యువ ఫౌండేషన్ సభ్యులు క్రీడా దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ సభ్యులు మాట్లాడుతూ.. మారుమూల ఏజెన్సీగుడాలలో మంచి క్రీడానైపుణ్యం కలిగిన యువకులు ఉన్నారని, వారిని ప్రోత్సహించిన ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని అన్నారు. యువతతోనే ఏజెన్సీఅభివృద్ధి సాధ్యమన్నారు.

February 20, 2026 / 07:33 AM IST

సిద్దిపేట ఐటీ హబ్‌లో ఉద్యోగ అవకాశాలు

SDPT: ఐటీ హాబ్ మేనేజర్ నరేందర్ గౌడ్ మహిళా అభ్యర్థులకు సువర్ణావకాశం ప్రకటించారని తెలిపారు. హైదరాబాద్ సోలార్ కంపెనీలో ఉద్యోగాల కోసం 50% మార్కులతో ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు, హిందీ భాషలో ప్రావీణ్యం ఉన్నవారు అర్హులన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు 20వ తేదీ వరకు https://forms.gle /AoKByEro8EvtckD67 దరఖాస్తు చేసుకోవాలన్నారు.

February 20, 2026 / 07:32 AM IST

గంజాయి కేసులో 20 ఏళ్లు జైలు శిక్ష

SRD: గంజాయి తరలిస్తూ పట్టుబడ్డ ఇద్దరికి 20 ఏళ్లు జైలు శిక్ష, రూ.2 లక్షల చొప్పున జరిమానా విధించారు. ఈ మేరకు సంగారెడ్డి ఫస్ట్ క్లాస్ అడిషనల్ సెషన్స్ కోర్ట్ న్యాయమూర్తి జయంతి గురువారం తీర్పు వెలువరించారని అందోలు ఎక్సైజ్ స్టేషన్ సీఐ సాగర్ రెడ్డి తెలిపారు. 2020 సెప్టెంబరులో 850 కేజీల గంజాయిని జాదవ్ బన్సీలాల్, రాథోడ్ శంకర్ రవాణా చేస్తుండగా పట్టుకున్నారు.

February 20, 2026 / 07:30 AM IST

నేడు ఫుడ్ కమిషన్ బృందం పర్యటన

KMR: రాష్ట్ర ఫుడ్ కమిషన్ బృందం నేడు KMR జిల్లాలో పర్యటించనుంది. కమిషన్ ఛైర్మన్, సభ్యులు ఉ.9:30 గం.కు KMR పట్టణంలోని R&B గెస్ట్ హౌస్ కు చేరుకోనున్నారు. ఉ.10:30 గం.కు మున్సిపల్ క్యాంటిన్లో ప్రజలకు విక్రయిస్తున్న పదార్థాల ధరలను తనిఖీ చేసి,11 గం.కు ZPHS పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేయనున్నారు.12 గం.కు అంగన్వాడి సెంటర్ ను,1 గం.లకు రామారెడ్డి PHCకీ వెళ్తారు.

February 20, 2026 / 07:28 AM IST

జమ్మిచేడు జమ్ములమ్మ దివ్య మంగళ స్వరూపంగా

GDWL: లోకపావని, చల్లని తల్లి జమ్ములమ్మ అమ్మవారు నేడు శుక్రవారం సందర్భంగా విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అని ఆలయ అర్చకులు తెలిపారు. గద్వాల జిల్లా జమ్మిచేడులో వెలసిన శ్రీ జమ్ములమ్మ అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించుకోవడానికి తెల్లవారుజాము నుండే భక్తులు భారీ సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారనారు.

February 20, 2026 / 07:25 AM IST

ఐఎన్‌టీయూసీ రాష్ట్ర కార్యదర్శిగా వికాస్ కుమార్

PDPL: ఐఎన్‌టీయూసీ రాష్ట్ర కార్యదర్శిగా రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి చెందిన వికాస్ కుమార్ యాదవ్‌ను నియమించారు. హైదరాబాద్‌లో జరిగిన యూనియన్ 21వ త్రైవార్షిక ప్రతినిధుల మహా సభలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అతి చిన్న వయసులో రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించడం పట్ల వికాస్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.

February 20, 2026 / 07:25 AM IST

చెరబండరాజు నగర్ దళిత వాసులకు రక్షణ ఆదేశాలు

HNK: భద్రఖాళీ దేవాలయ ప్రాంతంలోని చెరబండరాజు నగర్ కాలనీ దళిత వాసుల సమస్యలను మాజీ ప్రభుత్వ చీఫ్ విప్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్ గురువారం స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఛైర్మన్ డా: జస్టిస్ శామీర్ అక్తర్ దృష్టికి తీసుకెళ్లారు. ఛైర్మన్ సానుకూలంగా స్పందించి తగిన రక్షణ కల్పించేందుకు ఆదేశాలు జారీ చేశారు.

February 20, 2026 / 07:23 AM IST

టెన్త్‌లో ఉత్తీర్ణత శాతం పెంచాలి: కలెక్టర్

WGL: జిల్లాలో టెన్త్ క్లాస్ విద్యార్థుల ఉత్తమ ఫలితాలు సాధించి ఉత్తీర్ణత శాతం పెరిగేలా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డా. సత్య శారద ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. DEO అధ్యక్షుల గురువారం సాయంత్రం ప్రధానోపాధ్యాయులతో కలెక్టరేట్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. 10 th class విద్యార్థులకు స్పెషల్ క్లాస్ నిర్వహించాలని ఉపాధ్యాయులను కోరారు.

February 20, 2026 / 07:21 AM IST

‘ఇంటర్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలి’

VKB: జిల్లాలో ఈ నెల 25 నుంచి నిర్వహించనున్న ఇంటర్మీడియట్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలని జిల్లా ఇంటర్ బోర్డు నోడల్ అధికారి శంకర్ నాయక్ తెలిపారు. గురువారం వికారాబాద్ జిల్లా ఇంటర్ బోర్డు నోడల్ అధికారి కార్యాలయంలో ఇంటర్ పరీక్షలపై సమావేశం నిర్వహించారు.

February 20, 2026 / 07:20 AM IST

రాష్ట్రస్థాయి పోటీలలో సత్తా చాటిన దివ్యాంగ విద్యార్థులు

NGKL: హైదరాబాదులో నిర్వహించిన రాష్ట్రస్థాయి దివ్యాంగుల విద్యార్థుల క్రీడలలో నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు. క్రీడలలో పాల్గొని సత్తా చాటిన విద్యార్థులను జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ గురువారం సాయంత్రం అభినందించారు. జిల్లాకు చెందిన తులసీదర్, నాని, విద్యార్థులు క్రీడలలో సత్తా చాటి జిల్లాకు పేరు తేవడం గర్వకారణమని అన్నారు.

February 20, 2026 / 07:20 AM IST