PDPL: ఐఎన్టీయూసీ రాష్ట్ర కార్యదర్శిగా రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి చెందిన వికాస్ కుమార్ యాదవ్ను నియమించారు. హైదరాబాద్లో జరిగిన యూనియన్ 21వ త్రైవార్షిక ప్రతినిధుల మహా సభలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అతి చిన్న వయసులో రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించడం పట్ల వికాస్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.
HNK: భద్రఖాళీ దేవాలయ ప్రాంతంలోని చెరబండరాజు నగర్ కాలనీ దళిత వాసుల సమస్యలను మాజీ ప్రభుత్వ చీఫ్ విప్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్ గురువారం స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఛైర్మన్ డా: జస్టిస్ శామీర్ అక్తర్ దృష్టికి తీసుకెళ్లారు. ఛైర్మన్ సానుకూలంగా స్పందించి తగిన రక్షణ కల్పించేందుకు ఆదేశాలు జారీ చేశారు.
WGL: జిల్లాలో టెన్త్ క్లాస్ విద్యార్థుల ఉత్తమ ఫలితాలు సాధించి ఉత్తీర్ణత శాతం పెరిగేలా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డా. సత్య శారద ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. DEO అధ్యక్షుల గురువారం సాయంత్రం ప్రధానోపాధ్యాయులతో కలెక్టరేట్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. 10 th class విద్యార్థులకు స్పెషల్ క్లాస్ నిర్వహించాలని ఉపాధ్యాయులను కోరారు.
VKB: జిల్లాలో ఈ నెల 25 నుంచి నిర్వహించనున్న ఇంటర్మీడియట్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలని జిల్లా ఇంటర్ బోర్డు నోడల్ అధికారి శంకర్ నాయక్ తెలిపారు. గురువారం వికారాబాద్ జిల్లా ఇంటర్ బోర్డు నోడల్ అధికారి కార్యాలయంలో ఇంటర్ పరీక్షలపై సమావేశం నిర్వహించారు.
NGKL: హైదరాబాదులో నిర్వహించిన రాష్ట్రస్థాయి దివ్యాంగుల విద్యార్థుల క్రీడలలో నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు. క్రీడలలో పాల్గొని సత్తా చాటిన విద్యార్థులను జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ గురువారం సాయంత్రం అభినందించారు. జిల్లాకు చెందిన తులసీదర్, నాని, విద్యార్థులు క్రీడలలో సత్తా చాటి జిల్లాకు పేరు తేవడం గర్వకారణమని అన్నారు.
MLG: కన్నాయిగూడెం రైతు వేదికలో నిర్వహించిన కార్యక్రమంలో ములుగు మార్కెట్ కమిటీ ఛైర్మన్ రేగా కళ్యాణి ముఖ్య అతిథిగా పాల్గొని కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మండల తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. వివిధ గ్రామాల మహిళలు చెక్కులు అందుకున్నారు.
SRD: జిల్లాలో నేటి నుంచి స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహించాలని డీఈవో వెంకటేశ్వర్లు ఆదేశించారు. 20, 23 తేదీల్లో ప్రాథమిక స్థాయి, 24, 25 తేదీల్లో ప్రాథమికోన్నత స్థాయి ఉపాధ్యాయులకు ఈ సమావేశాలు జరుగుతాయని తెలిపారు. ఏర్పాట్లు పూర్తి చేయాలని కాంప్లెక్స్ హెచ్ఎంలు, ఏంఈవోలకు సూచించారు.
HYD: PM మత్స్య సంపద యోజన కింద HYD జిల్లాలో అర్హతగల మత్స్యకారులకు 16 బైక్లు (ఐస్ బాక్స్) మంజూరు చేసినట్లు జిల్లా మత్స్యశాఖాధికారి రజిని తెలిపారు. ఒక్క యూనిట్ విలువ రూ. 75,000 అని స్పష్టంచేశారు. జనరల్, SC/STలకు 40% (రూ.30వేలు), మహిళలకు 60% (రూ.45వేలు) రాయితీ ఉంటుంది. చేపల అమ్మకంలో అనుభవం, డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి అన్నారు.
SRCL: ఆటల్లో గెలుపు ఓటములు సహజం అని, గెలుపోటములను సమానంగా తీసుకోవాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. వేములవాడలో జరుగుతున్న 8వ తెలంగాణ రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీల ముగింపు సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫుట్ బాల్ ఆటగాడు మెస్సిని హైదరాబాద్ తీసుకువచ్చి స్వయాన ఫుట్ బాల్ ఆడి తనకు క్రీడల పట్ల ఉన్న మక్కువను చాటారని తెలిపారు.
BHPL:రేగొండ (M) కొడవటంచలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయ పునఃప్రతిష్ఠ మహోత్సవాలు ఈ నెల 20, 21 తేదీల్లో ఘనంగా జరగనున్నట్లు MLA గండ్ర సత్యనారాయణ రావు తెలిపారు. ఉమ్మడి WGL, కరీంనగర్ జిల్లాల ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని MLA పిలుపునిచ్చారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, రాష్ట్ర మంత్రులు, MPలు హాజరవుతున్నట్లు వెల్లడించారు.
BHNG: శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి నిత్య ఖజానాకు గురువారం సమకూరిన ఆదాయ వివరాలు ఇలా ఉన్నాయి. ఇందులో భాగంగా ప్రసాద విక్రయాలతో రూ.7,06,650, కార్ పార్కింగ్తో రూ.1,86,500, VIP దర్శనాలతో రూ. 1,35,000, బ్రేక్ దర్శనాలతో రూ.93,600, వ్రతాలతో రూ.1,18,000, కళ్యాణకట్ట రూ.68,500 లీజులతో రూ. 1 లక్ష, తదితర విభాగాల నుంచి మొత్తం కలిపి రూ. 16,08,397, ఆదాయం వచ్చిందన్నారు.
MHBD: పెద్దవంగర మండలంలోని పడమటి తండాకు చెందిన ధారావత్ సోమన్నపై తన కుమారుడు దారావత్ విజయ్ గురువారం కత్తితో గొంతుపై దాడి చేశాడు. పరిస్థితి విషమంగా ఉండడంతో కుటుంబ సభ్యులు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రమోద్ కుమార్ గౌడ్ తెలిపారు.
కరీంనగర్ జిల్లాలో ‘పీఎం శ్రీ’ కార్యక్రమం కింద ఎంపికైన పాఠశాలల్లో పెండింగ్ బిల్లుల అంశంపై విద్యాధికారులు, ప్రధానోపాధ్యా యులు, ట్రెజరీ శాఖ అధికారులతో కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడితో కలిసి సమీక్షించారు. వేతన బిల్లులు మినహా అన్నిరకాల చెల్లింపులు వెనువెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
JGL: ‘బెస్ట్ అవైలబుల్ స్కూల్స్’ పథకంలో భాగంగా 2026-27 విద్యా సంవత్సరానికి గాను ఉత్తమ పాఠశాలల ఎంపికకు జిల్లాలోని ప్రైవేట్ ఆంగ్ల మాధ్యమ పాఠశాలల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ సత్య ప్రసాద్ తెలిపారు. రెసిడెన్షియల్, నాన్ రెసిడెన్షియల్ పథకాల కింద ఎంపికైన పాఠశాలలకు విద్యార్థులకు ట్యూషన్ ఫీజు, హాస్టల్ వసతి, భోజన వసతితో పాటు నగదు అందజేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
SRD: పట్టణం బైపాస్ రహదారిలో పాత డీఆర్డీవోలో ఉన్న జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో శుక్రవారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా అధికారి నిర్మల తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. ఇంటర్మీడియట్, డిగ్రీ ఉత్తీర్ణులైన వారు ఉదయం 11 గంటలకు జరిగే జాబ్ మేళాకు హాజరు కావాలని చెప్పారు. ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలను కల్పిస్తామని పేర్కొన్నారు.