HNK: కాకతీయ యూనివర్సిటీ MSF ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ నరేష్ మాదిగ మాట్లాడుతూ.. దేశ తొలి ఉప ప్రధానిగా సేవలందించిన బాబు జగ్జీవన్ రావు కృషిని గుర్తించి కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రధానం చేయాలని కోరారు.