KMM: పేదలకు పంపిణీ చేసే రేషన్ బియ్యం పక్కదారి పడితే కఠిన చర్యలు తప్పవని సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ హెచ్చరించారు. చెన్నూరు గ్రామంలో రాత్రి వేళల్లో బియ్యం అక్రమ రవాణా జరుగుతోందన్న ఫిర్యాదుతో ఆదివారం ఆయన రేషన్ దుకాణాలను తనిఖీ చేశారు. స్టాక్ రిజిస్టర్లను పరిశీలించి, నిల్వలపై ఆరా తీశారు. లబ్ధిదారులకు బియ్యం సక్రమంగా పంపిణీ చేయాలని డీలర్లను ఆదేశించారు.