RR: సైబరాబాద్ సీపీ రమేశ్ 1,016 మొబైల్ ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అందజేశారు. IMEI ద్వారా ఫోన్ల గుర్తింపు ఇప్పుడు CEIR పోర్టల్తో సులభమైందని, మునుపటిలా మాన్యువల్ ప్రక్రియకు వెళ్లాల్సిన అవసరం లేదని చెప్పారు. పోయిన ఫోన్ను వేరే వ్యక్తి వాడిన వెంటనే అలర్ట్ వస్తుందని పేర్కొన్నారు. సైబర్ నేరగాళ్లపై ప్రత్యేక ఆపరేషన్లో 100 మందికిపైగా అరెస్ట్ చేశామన్నారు.