RR: రాజ్యసభ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన వేం నరేందర్ రెడ్డిని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిని శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాజ్యసభ సభ్యుడిగా విజయవంతంగా సేవలు అందించి, రాజ్యసభలో తెలంగాణ రాష్ట్ర ప్రజల సమస్యలను బలంగా ప్రస్తావించి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని కోరారు.