PDPL: ధర్మారం మండలం పత్తిపాక ప్రాథమిక పాఠశాల విద్యార్థులు ఇవాళ క్షేత్ర పర్యటనలో భాగంగా గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు వారికి దేవాలయాల ప్రాముఖ్యతను వివరించారు. అందరూ కలిసి భోజనాలు చేసి, సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు. హెచ్ఎం నూతి మల్లన్న, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.