NGKL: అచ్చంపేట రాజీవ్-ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన ‘సీవీకే ఆల్ స్టార్ ప్రీమియర్ లీగ్’ క్రికెట్ టోర్నమెంట్ బుధవారంతో ముగిసింది. ఫైనల్ మ్యాచ్ అనంతరం విజేతలకు ఎమ్మెల్యే వంశీకృష్ణ బహుమతులు ప్రధానం చేశారు. యువతలో క్రీడా స్ఫూర్తి పెరగాలని, అచ్చంపేట స్టేడియంలో అన్ని రకాల వసతులు కల్పిస్తామని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు.