WNP: కన్న కూతురిపై అత్యాచారం చేసిన తండ్రికి న్యాయస్థానం 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. గత ఏడాది మే 3న పానగల్ మండలంకు చెందిన కురుమయ్య కూతురుకు బుక్కులు ఇప్పిస్తానని చెప్పి తీసుకెళ్లి, పెబ్బేరు పరిధిలోని రంగాపురం గ్రామ సమీపంలో జూరాల కాల్వ వద్ద అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ కేసులో నేరం రుజువు కావడంతో 20 ఏళ్ల శిక్ష విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత తీర్పునిచ్చారు.