NRPT: ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారం ఊట్కూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రత్యేక హెల్త్ క్యాంప్ నిర్వహించనున్నట్లు డాక్టర్ సంతోషి తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగే ఈ శిబిరంలో గైనకాలజీ, డెంటల్, కంటి, ఎముకల, చిన్నపిల్లల వైద్య నిపుణులు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.