ADB: గుడిసెలు లేని తెలంగాణాను నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’ గ్రామ, వార్డు సభల నిర్వహణ, ఏర్పాట్లు, సంక్షేమ పథకాల అమలుపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో ఎలాంటి లోపాలు జరగకుండా చూడాలని ఆదేశించారు.