NLG: చిట్యాల మండలం వెలిమినేడు వద్ద జాతీయ రహదారిపై బుధవారం ఘోర ప్రమాదం జరిగింది. విజయవాడ నుండి హైదరాబాద్ వెళ్తున్న వాహనాన్ని వెనుక నుండి డీసీఎం ఢీకొట్టింది. ఈ ఘటనలో డీసీఎం డ్రైవర్కు తీవ్ర గాయాలవ్వడంతో, చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం వల్ల హైదరాబాద్ వైపు వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి, వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి.