JN: తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జనగామ జిల్లా మూడో మహాసభను ఈనెల 16న లింగాల ఘనపురంలో నిర్వహించనున్నట్లు సంఘం జిల్లా నాయకుడు సింగారపు రమేశ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయ కార్మికుల సమస్యలు, హక్కులపై ఇందులో చర్చించనున్నట్లు పేర్కొన్నారు. కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని మహాసభను జయప్రదం చేయాలని కోరారు.