BHPL: గోరికొత్తపల్లి మండలం నిజాంపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో బుధవారం బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్పంచ్ సునీత – రవీందర్ హాజరై మాట్లాడారు. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు, మధ్యాహ్న భోజన పథకం వంటి సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పాఠశాల HM, ఉప సర్పంచ్, తదితరులు ఉన్నారు.