PDPL: జూన్ 4 నుంచి నిర్వహించే గ్రామ, వార్డు సభల ద్వారా ప్రభుత్వ సందేశాన్ని ప్రతి ఇంటికి చేరేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు. ఈ మేరకు బుధవారం ఆయన ఓ ఫంక్షన్ హాల్లో జిల్లా స్థాయి అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వడదెబ్బ మృతులకు ఎక్స్గ్రేషియా, జాతీయ ప్రయోజనా పథకం గురించి వివరించాలని తెలిపారు.