MNCL: కాంగ్రెస్ ప్రభుత్వంలోనే నిరుపేదల సొంతింటి కల నెరవేరుతుందని సర్పంచ్ శ్రీనివాస్, మాజీ ZPTC సంతోశ్ కుమార్ అన్నారు. వేమనపల్లి మండలం గొల్లపల్లిలో ఇందిరమ్మ ఇంటి పథకం కింద నిర్మించిన పలు ఇళ్ల గృహప్రవేశ వేడుకల్లో వారు పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు వచ్చేలా కృషి చేస్తామన్నారు.