KMR: పల్వంచ మండలం భవానిపేట్ గ్రామానికి చెందిన పలువురు CITU నాయకులు ఆ సంఘానికి రాజీనామా చేసి, మంగళవారం తెలంగాణ బహుళ బీడీ కార్మిక సంఘంలో చేరారు. యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు సిద్దిరాములు మాట్లాడుతూ.. కార్మికుల పక్షాన నిలిచి పోరాటం చేస్తామని, వారి హక్కులను కాపాడటమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగారపు ఎల్లయ్య ఉన్నారు.
BHNG: ఆలేరు మండలం కొలనుపాకలో సర్వే నంబర్–8లో ఉన్న ప్రభుత్వ భూమిలో 3ఎకరాలను అర్హులైన పేదలకు కేటాయించాలని స్థానిక పేదలు అనేక రోజులుగా గుడిసెలు వేసుకుని అక్కడే నివసిస్తున్నారు. ఈ సందర్భంగా పేదల తరఫున మంగళవారం CPI జాతీయ కార్యదర్శి కామ్రేడ్ పల్లా వెంకటరెడ్డి, MLA కామ్రేడ్ కూనమనేని సాంబశివరావు, MLC నెల్లిగంటి సత్యంలకు మెమొరాండం అందజేశారు.
MDCL: ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా జేఎన్టీయూ యూనివర్సిటీలోని ఇంజినీరింగ్ కళాశాల లైబ్రరీలో బుక్స్ ఎగ్జిబిషన్ను VC కిషన్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. రిజిస్ట్రార్ వెంకటేశ్వరరావు, డైరెక్టర్ విజయ్ కుమార్ రెడ్డి కలిసి పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులతో ముచ్చటించారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో నూతన ఉత్సాహాన్ని పెంపొందిస్తాయని వెల్లడించారు.
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలానికి చెందిన కందుకూరి మంగ ఉత్తమ అంగన్వాడీ సూపర్వైజర్గా ఎంపికయ్యారు. ఈరోజు సూర్యాపేట కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ సీతారామారావు చేతుల మీదుగా ఆమె ప్రశంసా పత్రం, జ్ఞాపికను అందుకున్నారు. విధి నిర్వహణలో ఆమె కనబరిచిన ప్రతిభను గుర్తించి ఈ పురస్కారం అందజేశారు.
MHBD: జాతీయ దంత వైద్యుల దినోత్సవాన్ని జిల్లా కేంద్రంలోని పలువురు దంతవైద్యులు మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్బంగా జిల్లాలో మొట్టమొదటి దంతవైద్యడు డాక్టర్ అనీల్ గుప్తను ఘనంగా సన్మానించారు. జిల్లా ప్రజలకు ఉత్తమ సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు డా.వీరన్న నాయక్, డా.లెనిన్ చంద్ర, డా.రాకేష్, సుమంత, తదితరులున్నారు.
KMM: మార్చి 12న భక్త రామదాసు కళాక్షేత్రంలో ప్రజా ప్రతినిధులకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంపై శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణా రావు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంపై అన్ని జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
SDPT: పదవ తరగతి విద్యార్థులు లక్ష్యంతో చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలని గజ్వేల్ రూరల్ సీఐ రవి, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు బాల్ రెడ్డి సూచించారు. క్షీరసాగర్లో ఒక ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు మోటివేషన్ క్లాసులతో పాటు పరీక్ష ప్యాడ్లు, పెన్నులను పంపిణీ చేశారు. మండల విద్యాశాఖ అధికారి ఉదయ భాస్కర్ రెడ్డి పాల్గొని పరీక్షల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.
NRPT: దామరగిద్ద ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు విజయలక్ష్మి పదవీ విరమణ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ముఖ్య అతిథిగా పాల్గొని విజయలక్ష్మి దంపతులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. మనకు విద్య నేర్పిన గురువులకు ఘనంగా వీడ్కోలు పలికే సంస్కృతీ మనదన్నారు. ప్రతీ ఒక్కరు తల్లిదండ్రులతో సమానంగా గురువులను గౌరవించాలన్నారు.
NZB: భీమగల్ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ ఎన్నికలు మంగళవారం జరిగాయి. అధ్యక్షుడిగా తిరునగరి పృధ్విరాజ్, ఉపాధ్యక్షుడిగా రవి, ప్రధాన కార్యదర్శిగా చంద్రమోహన్, కోశాధికారిగా బ్రహ్మానంద్ ఎన్నికయ్యారు. పృధ్విరాజ్ మాట్లాడుతూ.. యూనియన్ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో సుధాకర్, డీ.ఎస్. రవి, శ్రీనాథ్, దామోదర్, ప్రమోద్, చంద్రశేఖర్ ఉన్నారు.
NGKL: ప్రజా పాలన 99 రోజుల ప్రత్యేక సేవలలో భాగంగా వెల్దండ పీహెచ్సీ ఆధ్వర్యంలో గుండాల ఏకలవ్య మోడల్ పాఠశాలలో ఆరోగ్య శిబిరం నిర్వహించారు. విద్యార్థులకు ఉచిత వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. పోషకాహార లోపాలపై అవగాహన కల్పించిన ఈ కార్య క్రమంలో వైద్యులు, ఫార్మసీ సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
MBNR: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన 99 రోజుల ప్రణాళిక కార్యక్రమాల ద్వారా పారిశుధ్య చర్యలను ముమ్మరం చేస్తున్నామని మహబూబ్నగర్ మేయర్ గుమ్మాల మమత అన్నారు. మంగళవారం మహబూబ్నగర్ కార్పొరేషన్ పరిధిలోని 14, 35వ డివిజన్లో మున్సిపల్ అధికారులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా తీసుకోవాల్సిన పరిస్థితి చర్యల గురించి సిబ్బందికి వివరించారు.
SRD: పటాన్చెరు నియోజకవర్గంలోని ఇంద్రేశం మున్సిపాలిటీలో డంప్ యార్డును మున్సిపల్ శాఖ జేడీ సంధ్య మంగళవారం సందర్శించి పరిశీలించారు. ఈ మేరకు పట్టణంలోని పరిసర ప్రాంతాలను కూడా ఆమె పర్యవేక్షించారు. జేడీ సంధ్య స్థానిక మున్సిపల్ కమిషనర్, సిబ్బందితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పట్టణంలో ప్రజలకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
JGL: ఆపదలో ఉన్న పేదలకు ప్రభుత్వం ఎల్లవేళలా అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల పట్టణంలోని 42వ వార్డుకు చెందిన కాలేరు వెంకటేశంకు మంజూరైన రూ.2.50 లక్షల విలువైన ఎల్వోసీ పత్రాన్ని మంగళవారం ఆయన కార్యాలయంలో ఎమ్మెల్యే అందజేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాల లబ్ధి చేరేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
JN: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక పై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు మంగళవారం నిర్వహించిన వీసీలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో పాటు జిల్లా అధికారులు పాల్గొన్నారు. నూతనంగా ఎన్నికైన సర్పంచులు, కౌన్సిలర్లకు పాలనపై పూర్తి స్థాయిలో అవగాహన కలిగేందుకు కార్యక్రమం దోహదపడుతుందన్నారు. ప్రజాప్రతినిధులకు నిర్వహించే శిక్షణను విజయవంతం చేయాలన్నారు.
JGL: ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా జగిత్యాలలోని ప్రభుత్వ ఐటీఐ-ఏటీసీలో రెండు వారాల స్వల్పకాలిక నైపుణ్య శిక్షణ కోర్సులను ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ప్రారంభించారు. యువత నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాల పెంపు లక్ష్యంగా సీఎన్సీ, ఆటోమేషన్, ఎలక్ట్రికల్ వెహికల్స్, సీఐడీ తదితర కోర్సులు ప్రారంభించినట్లు ఆయన తెలిపారు.