• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

ఆసిఫాబాద్ ఈవీఎం గోదామును తనిఖీ చేసిన కలెక్టర్

ASF: జిల్లా కలెక్టర్ కె. హరిత జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోదామును సందర్శించారు. నెలవారీ తనిఖీల్లో భాగంగా సీసీటీవీ కెమెరాలు, భద్రతా ఏర్పాట్లు మరియు రిజిస్టర్లను పరిశీలించారు. యంత్రాల భద్రత విషయంలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.

May 5, 2026 / 07:03 PM IST

ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్

MHBD: జిల్లా కలెక్టర్ స్నేహా శబరీష్ ఆదేశాల మేరకు మరిపెడ, దంతాలపల్లి, తొర్రూరు, పెద్దవంగర మండలాల్లోని కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ అనిల్ ఇవాళ తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచి, సేకరించిన ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లులకు తరలించాలని అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

May 5, 2026 / 07:02 PM IST

‘రైతుల వద్ద నాణ్యమైన ధాన్యం కొనుగోలు చేయాలి’

MNCL: కొనుగోలు కేంద్రాలలో రైతుల వద్ద నుండి నిబంధనల ప్రకారం నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ రాములు అన్నారు. మంగళవారం లక్షెట్టిపేట మండలంలోని పలు రైస్ మిల్లులను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కొనుగోలు చేసిన ధాన్యాన్ని కేటాయించిన ప్రకారం రైస్ మిల్లులకు తరలించడం జరుగుతుందని తెలిపారు.

May 5, 2026 / 07:02 PM IST

ఘనంగా నవాజ్ దర్గా 36 వ ఉర్సు ఉత్సవాలు

SRD: సదాశివపేట మండలం సూరారం గ్రామంలోని హజ్రత్ ఖాజే బందే నవాజ్ దర్గా 36వ ఉర్సు ఉత్సవ కార్యక్రమాలు మంగళవారం ఘనంగా జరిగాయి. గత మూడు రోజుల నుంచి జరుగుతున్న ఉర్సు ఉత్సవాల్లో భాగంగా ఆధ్యాత్మిక ప్రవచనాలు, ఖవాలీ కార్యక్రమాలు ముస్లింలు నిర్వహించారు. ఇందులో టీజీఐఐసీ ఛైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి దర్గాను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

May 5, 2026 / 07:01 PM IST

రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై CPI ఆగ్రహం

NGKL: జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డులో మొక్కజొన్న రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై CPI జిల్లా కార్యదర్శి ఎస్ఎండీ ఫయాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మార్కెట్ యార్డును సందర్శించి రైతుల సమస్యలను తెలుసుకున్నారు. 24 గంటల్లో సమస్యలు పరిష్కరించకపోతే జిల్లా వ్యాప్తంగా రైతులను సమీకరించి ఆందోళనలు చేపడతామని ఆయన హెచ్చరించారు.

May 5, 2026 / 07:01 PM IST

రైతులు లాభసాటి సాగు చేయాలి: కలెక్టర్ రాజర్షి షా

ADB: రైతులు వ్యవసాయ అధికారుల సూచనలు పాటిస్తూ లాభసాటి సాగు చేయాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. ‘ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని హార్టికల్చర్ రీసెర్చ్ స్టేషన్‌లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. రైతులు మార్కెట్‌లో డిమాండ్ ఉన్న పంటలను మాత్రమే సాగు చేయాలన్నారు. మున్సిపల్ ఛైర్మన్ అనూష, AMC ఛైర్మన్ శ్రీకాంత్ రెడ్డి ఉన్నారు.

May 5, 2026 / 07:01 PM IST

బాధితుడికి LOC అందజేత

SDPT: బెజ్జంకి మండలం ముత్తన్నపేట గ్రామస్థుడు బొర్ర రాజు రోడ్డు ప్రమాదంలో గాయపడి నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన వైద్య ఖర్చుల నిమిత్తం మంజూరైన రూ.1.25 లక్షల (LOC) పత్రాన్ని రాష్ట్ర ఆహార భద్రత కమిషన్ సభ్యుడు వోరగంటి ఆనంద్ బాధిత కుటుంబానికి అందజేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సహకారంతో ఈ సాయం అందిందని వారు ఆనంద్ తెలిపారు.

May 5, 2026 / 07:01 PM IST

మొక్కజొన్న తరలింపునకు లారీలు కేటాయించాలి: సీపీఐ

WGL: నల్లబెల్లి మొక్కజొన్న కొనుగోలు కేంద్రం నుంచి గోదాములకు ధాన్యం తరలింపునకు లారీలు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారని సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యుడు చింతకింది కుమారస్వామి ఆరోపించారు. టెండర్లు పిలిచినా అగ్రిమెంట్ ఇవ్వకపోవడంతో వాహనాలు రావడం లేదన్నారు. సమస్య పరిష్కరించాలని మంగళవారం కలెక్టరేట్లో డీఆర్‌వో విజయలక్ష్మి కి వినతి పత్రం అందజేశారు.

May 5, 2026 / 07:01 PM IST

155వ రోజుకు చేరిన రిలే నిరాహారదీక్షలు

NGKL: చారకొండ మండలం, ఎర్రవల్లి తండా, గ్రామస్థుల రిలే నిరాహార దీక్షలు మంగళవారం నాటికి 155వ రోజుకు చేరాయి. డిండి ప్రాజెక్టు రిజర్వాయర్ సామర్థ్యం తగ్గించి, తమ ఇళ్లు, భూములను ముంపు నుంచి రక్షించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. 5 నెలలుగా నిరంతరాయంగా దీక్షలు చేస్తున్నా పాలకులు స్పందించకపోవడంపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

May 5, 2026 / 07:00 PM IST

PACS పర్సన్ ఇంఛార్జ్‌గా బలరాం రెడ్డి బాధ్యతలు

PDPL: నంది మేడారం పాక్స్ పర్సన్ ఇన్చార్జ్‌గా మాజీ అధ్యక్షుడు బలరాం రెడ్డి ఇవాళ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం తిరిగి పాత పాలకవర్గాలు బాధ్యతలు స్వీకరించాలని ఆదేశాలు జారీ చేయడంతో బాధ్యతలు చేపట్టారు. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు పదవిలో కొనసాగనున్నారు. ఈ కార్యక్రమంలో సీఈవో మల్లేశం, డైరెక్టర్లు పాల్గొన్నారు.

May 5, 2026 / 07:00 PM IST

భద్రాచలం డిపోలో ‘ప్రగతి చక్ర’ పురస్కారాలు అందజేత

BDK: ఆర్టీసీలో ఉత్తమ సేవలు అందించిన సిబ్బందికి మంగళవారం భద్రాచలం డిపోలో ‘ప్రగతి చక్ర’ అవార్డులను ప్రదానం చేశారు. ఖమ్మం రీజియన్ వ్యాప్తంగా 56 మంది డ్రైవర్లు, కండక్టర్లు ఈ పురస్కారాలు అందుకోగా, భద్రాచలం డిపో నుంచి 19 మంది ఎంపికయ్యారు. రీజనల్ మేనేజర్ సలీమ్ వారికి అవార్డులు అందజేశారు. సంస్థ అభివృద్ధికి కృషి చేయాలని అధికారుల పిలుపునిచ్చారు.

May 5, 2026 / 07:00 PM IST

‘ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా డిక్లేర్ చేయాలి’

SRCL: ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా డిక్లేర్ చేయాలని రాష్ట్ర మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు. గంభరావుపేట మండల కేంద్రంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రానికి వస్తున్న మోదీ రైతులకు కల్లబొల్లి మాటలు చెప్పవద్దన్నారు. మిడ్ మానేర్ నిర్మించింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యమని మంత్రి తెలిపారు.

May 5, 2026 / 06:55 PM IST

కాంగ్రెస్ రైతు ద్రోహాన్ని ఎండగడుదాం: సారంగపాని

WGL: కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నట్టేట ముంచిందని BRS పార్టీ మండల అధ్యక్షుడు బానోత్ సారంగపాణి అన్నారు. బుధవారం హనుమకొండ హంటర్ రోడ్డు సీఎస్ఆర్ గార్డెన్ సర్కిల్‌లో ఉదయం 9:30కు జరిగే రైతు సంగ్రామ సదస్సుకు ప్రతి గ్రామం నుంచి రైతులు తరలిరావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. BRS పార్టీ కార్యాలయంలో రైతు సంక్రమ సదస్సు పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు.

May 5, 2026 / 06:48 PM IST

ప్రపంచ చరిత్రను మలుపు తిప్పిన మహానేత కారల్ మార్క్స్

KNR: ప్రపంచ చరిత్రను మలుపు తిప్పిన మహానేత కారల్ మార్క్స్ అని సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి అన్నారు. సీపీఎం జిల్లా కార్యా లయంలో మార్క్స్ 209వ జయంతి సందర్భంగా చిత్రపటానికి నివాళులర్పించారు. మార్క్సిజం సమాజాన్ని ముందుకు నడిపించే శక్తిగా నిలిచిందన్నారు. కార్మిక హక్కుల కోసం మార్క్స్ సిద్ధాంతాలు మార్గదర్శకమని తెలిపారు.

May 5, 2026 / 06:47 PM IST

మహిళా పోలీసులు ధైర్యంగా, గర్వంగా పనిచేయాలి: ఎస్పీ

SRPT: మహిళా పోలీసులు ధైర్యంగా, గర్వంగా పనిచేయాలని ఎస్పీ నరసింహ సూచించారు. మంగళవారం సూర్యాపేటలోని ఎస్పీ కార్యాలయంలో పోష్ యాక్ట్-2013 చట్టంపై మహిళ పోలీస్ అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించి మాట్లాడారు. సమస్యలు ఉంటే పెద్దన్నగా అండగా ఉంటానని, పని ప్రదేశంలో వేధింపులపై ధైర్యంగా ఫిర్యాదు చేయాలన్నారు. మహిళల భద్రతకు పోలీస్ శాఖ కృషి చేస్తుందన్నారు.

May 5, 2026 / 06:47 PM IST