• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

జనగణన సర్వేకు సహకరించండి: కలెక్టర్

SRPT: జనగణన–2027 దేశాభివృద్ధికి కీలకమని, ప్రజలందరూ సర్వే సిబ్బందికి సరైన వివరాలు అందించి సహకరించాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ కోరారు. సేకరించిన గణాంకాలు సంక్షేమ పథకాలకు ఎంతో ఉపయోగపడతాయన్నారు. అపోహలకు తావివ్వకుండా, ప్రజలందరూ సర్వేలో పాల్గొని ఖచ్చితమైన వివరాలను నమోదు చేయించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు

June 3, 2026 / 07:33 PM IST

కొనుగోలు ప్రక్రియను సకాలంలో పూర్తిచేయాలి: కలెక్టర్

KMR: జిల్లాలో మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియను సకాలంలో పూర్తి చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. బుధవారం సదాశివనగర్ మండలం పద్మాజీవాడి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. కొనుగోలు కేంద్రం వద్ద రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

June 3, 2026 / 07:32 PM IST

మోడల్ స్కూల్ ప్రవేశాలపై అవగాహన కార్యక్రమం

MLG: వెంకటాపూర్ మండలం జవహర్ నగర్ ప్రభుత్వ మోడల్ పాఠశాల ఉపాధ్యాయులు బుధవారం పలు గ్రామాల్లో ‘బడిబాట’ కార్యక్రమం నిర్వహించారు. ప్రిన్సిపల్ మందపల్లి కృష్ణ మాట్లాడుతూ.. మోడల్ స్కూల్, కళాశాలలో విద్యార్థులకు ఉచిత విద్యతో పాటు భోజనం, వసతి సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. నాణ్యమైన విద్య అందిస్తున్నామని పేర్కొంటూ తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.

June 3, 2026 / 07:32 PM IST

కడెం మండలంలో పలువురిని పరామర్శించిన ఎమ్మెల్యే

NRML: కడెం మండలం మాసాయిపేట్ సర్పంచ్ కొన్ని రోజుల క్రితం ఆత్మహత్య చేసుకొని చనిపోవడంతో వారి కుటుంబసభ్యులను ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ బుధవారం పరామర్శించారు. అనంతరం వారికి ఆర్ధిక సహాయం అందజేశారు. అలాగే మండలంలో కలీం తల్లి, బిగ్ టీవీ రిపోర్టర్ తండ్రి గుండెపోటుతో హఠాత్మరణం చెందారు. ఎమ్మెల్యే వారి ఇంటికి వెళ్లి ధైర్యంగా ఉండాలని ఓదార్చారు.

June 3, 2026 / 07:30 PM IST

‘ఎస్ఐఆర్ ప్రక్రియపై ఓటర్లకు అవగాహన కల్పించాలి’

GDWL: ఎస్ఐఆర్ ప్రక్రియపై ఓటర్లకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ పేర్కొన్నారు. గ్రామ, వార్డు సభల్లో ప్రభుత్వం సూచించిన అంశాలన్నింటినీ ప్రస్తావిస్తూ సజావుగా నిర్వహించాలన్నారు. బుధవారం గద్వాల కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి ఈనెల 4, 6, 8,10వ తేదీల్లో జిల్లా వ్యాప్తంగా నిర్వహించు సభలపై చర్చించారు.

June 3, 2026 / 07:29 PM IST

రాష్ట్రంలో రాబోయేది BRS ప్రభుత్వమే: మాజీ మంత్రి

NRPT: కాంగ్రెస్ పాలనలో ప్రజలు విసిగిపోయారని, రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని మాజీ హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. నారాయణపేటలోని పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం నిర్వహించిన పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు అవగాహన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. అత్యధిక సభ్యత్వాలు చేయించి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలవాలన్నారు.

June 3, 2026 / 07:26 PM IST

‘విద్యార్థులు తక్కువ గల పాఠశాలలపై దృష్టి సారించాలి’

JGL: విద్యార్థులు తక్కువ గల పాఠశాలలపై దృష్టి సారించాలని రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితా రానా అన్నారు. జిల్లా కలెక్టర్లు, డీఈవోలతో బుధవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విద్యార్థుల నమోదు పెంచుటకు గ్రామంలోని ప్రతి ఒక్కరిని భాగస్వాములు చేయాలని సూచించారు. ఈ కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ సత్యప్రసాద్, అదనపు కలెక్టర్ బిఎస్ లత పాల్గొన్నారు.

June 3, 2026 / 07:24 PM IST

జహీరాబాద్‌లో BRS నాయకుల పాదయాత్ర

SRD: MLA హరీష్ రావు జన్మదినం & సంకటహర చతుర్థి సందర్భంగా BRS నేత రవి కిరణ్ ఆధ్వర్యంలో జహీరాబాద్‌లోని భవాని మందిరం నుంచి న్యాల్కల్ మం. రేజింతల్ స్వయంభు వరసిద్ధి వినాయక ఆలయం వరకు బుధవారం పాదయాత్ర నిర్వహించారు. రేజింతల్ వరసిద్ధి వినాయక ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిపించారు. ఈ కార్యక్రమం ద్వారా నాయకులు ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.

June 3, 2026 / 07:22 PM IST

‘ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలి’

MNCL: ప్రభుత్వం చేపట్టిన ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం జైపూర్ మండలంలోని వివిధ రైస్ మిల్లులు, ధాన్యం కొనుగోలు కేంద్రం, గోదాములను సందర్శించారు. నిబంధనల ప్రకారం నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతుల ఖాతాలలో నగదు జమ చేయడం జరుగుతుందని తెలిపారు.

June 3, 2026 / 07:20 PM IST

వన్ వార్డ్ ఎవరీ డేలో ప్రజా సమస్యలపై కమిషనర్ సమీక్ష

MDCL: కుత్బుల్లాపూర్ జోన్‌లోని పూడూరు-కిష్టాపూర్ వార్డులో ‘వన్ వార్డ్ ఎవరీ డే’ కార్యక్రమంలో కమిషనర్ పర్యటించారు. రహదారులు, తాగునీటి సరఫరా, మురుగునీటి వ్యవస్థ, చెరువుల పరిరక్షణ, వీధి దీపాల ఏర్పాటుపై ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. సమస్యలను పరిశీలించి ప్రాధాన్యత క్రమంలో పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

June 3, 2026 / 07:19 PM IST

హైదరాబాద్‌లో విద్యాశాఖ సమీక్ష సమావేశం

HYD: హైదరాబాద్‌లో విద్యాశాఖ కార్యదర్శి యోగిత రానా, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ దేవసేన జిల్లా కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విద్యార్థుల నమోదు పెంపు, విద్యా నాణ్యత మెరుగుదల, విద్యా రంగ అభివృద్ధిపై సమీక్ష చేపట్టారు. ఈ సమావేశంలో ములుగు జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు పాల్గొన్నారు.

June 3, 2026 / 07:11 PM IST

కొత్తగూడలో అంబులెన్స్ సేవల తనిఖీ

MHBD: కొత్తగూడ మండల కేంద్రంలో 102 అంబులెన్స్ సేవల జిల్లా ఇంఛార్జ్ షేక్ ఇమామ్ పాషా అంబులెన్స్‌ను బుధవారం తనిఖీ చేశారు. అంబులెన్సులోని వైద్య పరికరాలు, అత్యవసర మందులు, పరిశుభ్రత, ఇంధన వినియోగం, సాంకేతిక పరిస్థితిని పరిశీలించారు. సేవల నాణ్యతను మెరుగుపరచి రోగులకు ఉత్తమ సేవలు అందించాలని సిబ్బందికి ఆయన సూచించారు.

June 3, 2026 / 07:10 PM IST

ఇందిరమ్మ ఇండ్ల ప్రవేశాలు చేపట్టిన ఎంపీడీవో

MDK: తూప్రాన్ మండలం యావాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల ప్రవేశాలు చేపట్టినట్లు ఎంపీడీవో సతీష్ తెలిపారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో సామూహిక గృహప్రవేశాలను నిర్వహించినట్లు తెలిపారు. యావపూర్ గ్రామంలో సర్పంచ్ యాంజాల స్వామితో కలిసి మూడు ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాలను చేపట్టినట్లు వివరించారు.

June 3, 2026 / 07:07 PM IST

బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్‌తో కవిత భేటీ

HYD: కల్వకుంట్ల కవితతో గారెత్ విన్ ఓవెన్ హైదరాబాద్‌లో భేటీ అయ్యారు. బంజారాహిల్స్‌లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో జరిగిన సమావేశంలో భారత్- యునైటెడ్ కింగ్‌డమ్ ద్వైపాక్షిక సంబంధాలు, రాజకీయ, ఆర్థిక అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు కూడా పాల్గొన్నారు.

June 3, 2026 / 07:07 PM IST

ప్రజల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం: వేముల

NLG: నకిరేకల్ మండలం కడపర్తి గ్రామానికి చెందిన పొట్టేపాక సైదులు నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశం కార్యక్రమంలో బుధవారం ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  ప్రజల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ద్వారా ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కళ నెరవేరుతోందన్నారు.

June 3, 2026 / 07:02 PM IST