NRPT: దామరగిద్ద ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు విజయలక్ష్మి పదవీ విరమణ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ముఖ్య అతిథిగా పాల్గొని విజయలక్ష్మి దంపతులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. మనకు విద్య నేర్పిన గురువులకు ఘనంగా వీడ్కోలు పలికే సంస్కృతీ మనదన్నారు. ప్రతీ ఒక్కరు తల్లిదండ్రులతో సమానంగా గురువులను గౌరవించాలన్నారు.