TG: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎండల తీవ్రత దృష్ట్యా అంగన్వాడీ కేంద్రాలకు ఇవాళ్టి నుంచి ఏప్రిల్ 30 వరకు ఒంటిపూట బడులు అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు అంగన్వాడీ కేంద్రాలు నడవనున్నాయి. సెలవుల్లోనూ అంగన్వాడీ పిల్లలకు రేషన్ పంపిణీ చేయనుంది.