VZM: జిల్లాలోని పాత్రికేయులంతా తమ ఆరోగ్యంపట్ల శ్రద్ద వహించాలని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి కోరారు. జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో స్థానిక తిరుమల మెడికవర్ ఆసుపత్రిలో అక్రిడేటెడ్ జర్నలిస్టులకు గత ఐదు రోజులుగా ప్రత్యేకంగా నిర్వహిస్తున్న ఉచిత వైద్య ఆరోగ్య పరీక్షల శిబిరాన్ని కలెక్టర్ ఇవాళ సందర్శించారు.