AP: రాష్ట్రంలో ఇవాళ NTR వైద్య సేవలు నిలిచిపోయాయి. బకాయిల విడుదలలో జాప్యం చేయడాన్ని నిరసిస్తూ నెట్వర్క్ ఆసుపత్రులు నిరసన చేపట్టాయి. ఈ మేరకు NTR వైద్యసేవలు నిలిపివేశాయి. నెట్వర్క్ ఆసుపత్రులకు రూ.3 వేల కోట్ల బకాయిలు పెండింగ్లో ఉన్నాయని.. ప్రభుత్వం వెంటనే వాటిని విడుదల చేయాలని డిమాండ్ చేశాయి.