GDWL: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా రేపు నిర్వహించే గ్రామ, వార్డు సభలను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సంబంధిత అధికారులకు పిలుపునిచ్చారు. బుధవారం జిల్లాలోని అన్ని మండలాల ప్రత్యేక అధికారులు, తహసీల్దారులు, పురపాలక సంఘాల కమిషనర్లు, తదితరులతో జిల్లా కలెక్టర్ గూగుల్ మీట్ ద్వారా గ్రామసభల నిర్వహణపై మాట్లాడారు.