KNR: సైదాపూర్ మండలంలోని లస్మన్నపల్లి అంగన్వాడీ కేంద్రంలో బుధవారం సర్పంచ్ మ్యాకల స్వప్న బాలామృతం ప్యాకెట్లు, కోడిగుడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్ఠిక ఆహారం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్త అబ్బిడి స్వరాజ్యం, గ్రామపంచాయతీ పాలకవర్గం పాల్గొన్నారు.