GDWL: వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద గట్టు, గద్వాల మండలాలకు చెందిన 16 మంది రైతులకు సబ్సిడీ యంత్రాలను గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బుధవారం పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పనిముట్లు, ఉచిత విద్యుత్ అందించి రైతులకు గిట్టుబాటు ధర దక్కేలా కృషి చేశామన్నారు. భవిష్యత్తులోనూ సాంకేతికతను అందిపుచ్చుకుని రైతులు ఆర్థికంగా ఎదగాలని అన్నారు.