WG: పెనుమంట్ర మండలంలో ఈ నెల 7 నుంచి 10వ తేదీ వరకు నిషేధిత భూముల జాబితాపై ప్రత్యేక రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు తహశీల్దార్ వై.రవికుమార్ తెలిపారు. 7న ఎస్.ఐ.పర్రు, జుత్తిగ, 8న మాముడూరు, పాలమూరు, 9న సత్యవరం, నెలమూరు, 10న వెలగలేరు, మార్టేరు సహా పలు గ్రామాల్లో ఈ సదస్సులు జరుగుతాయని పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.