AP రాజధాని, ప్రత్యేక హోదాపై సమాజ్వాది పార్టీ MP ధర్మేంద్ర యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి పేరిట రైతులు నుంచి భూములు తీసుకుంటున్నారని, విశాఖను రాజధాని చేసి ఉంటే ఇంత ఖర్చయ్యేది కాదన్నారు. అయినా రాష్ట్రాల హక్కుల కోసం అమరావతి రాజధాని బిల్లుకు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. APని BJP మోసం చేస్తోందని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు.