NRPT: ఉత్తర ప్రదేశ్లో జరిగిన జాతీయ నెట్ బాల్ పోటీల్లో కొండాపూర్ గురుకుల విద్యార్థులు కిషన్, మోహన్, హర్షవర్ధన్ రజత పతకం సాధించారు. తెలంగాణ జట్టు తరపున ఆడి పతకం గెలిచిన వీరిని పీఈటీ అంజనేయులు, గురుకుల నిర్వాహకులు అభినందించారు. జాతీయ స్థాయిలో రాణించి గ్రామానికి, పాఠశాలకు పేరు తెచ్చినందుకు హర్షం వ్యక్తం చేశారు.