కృష్ణా: ఎన్హెచ్-16 పై గన్నవరం సమీపంలోని పొట్టిపాడు టోల్ ప్లాజాను మూసివేసి మంగళవారం అర్ధరాత్రి నుంచి వాహనదారులకు టోల్ ఫ్రీ చేశారు. అదే సమయంలో విజయవాడ వెస్ట్ బైపాస్లో సూరంపల్లి వద్ద కొత్త టోల్ ప్లాజాను ప్రారంభించారు. టెండర్ ప్రక్రియ పూర్తయ్యే వరకు తాత్కాలికంగా జాతీయ రహదారుల అధికారులు నిర్వహణ చేపట్టినట్లు సమాచారం.