BHNG: ఆలేరు మండలం కొలనుపాకలో సర్వే నంబర్–8లో ఉన్న ప్రభుత్వ భూమిలో 3ఎకరాలను అర్హులైన పేదలకు కేటాయించాలని స్థానిక పేదలు అనేక రోజులుగా గుడిసెలు వేసుకుని అక్కడే నివసిస్తున్నారు. ఈ సందర్భంగా పేదల తరఫున మంగళవారం CPI జాతీయ కార్యదర్శి కామ్రేడ్ పల్లా వెంకటరెడ్డి, MLA కామ్రేడ్ కూనమనేని సాంబశివరావు, MLC నెల్లిగంటి సత్యంలకు మెమొరాండం అందజేశారు.