MHBD: కేసముద్రంలో నేడు జరిగిన వ్యవసాయ కార్మిక సంఘం 3వ జిల్లా మహాసభల్లో రాష్ట్ర అధ్యక్షుడు జీ. నాగయ్య పాల్గొన్నారు. భూమిలేని పేదలకు భూముల పంపిణీ చేయాలని, ఉపాధి హామీ కూలీలకు కనీస వేతనం రూ. 600 ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కూలీ బందు, ఇళ్ల స్థలాలు, పోడు భూముల హక్కు పత్రాల అమలులో ప్రభుత్వం విఫలమైందని విమర్శిస్తూ.. పేదల హక్కుల కోసం ఉద్యమాలకు సిద్ధం కావాలన్నారు.