SRPT: ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మున్సిపల్ కమిషనర్ రామచంద్రరావు అన్నారు. మంగళవారం తిరుమలగిరి మున్సిపాలిటీలోని 6వ వార్డులో ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా మురికి కాల్వలను పరిశుభ్రం చేసి పిచ్చి మొక్కలను తొలగించి మాట్లాడారు. పరిసర పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే వ్యాధులు దరిచేరవన్నారు.
BHPL: రేగొండ మండలం చెన్నపూర్ గ్రామంలో రోడ్డు నిర్మాణ పనులను స్థానికులు మంగళవారం అడ్డుకున్నారు. గతంలో అభ్యంతరాలతో నిలిచిపోయిన పనులు మళ్లీ ప్రారంభించగా, గ్రామానికి రోడ్డు వెడల్పు చేసి సీసీ రోడ్డు నిర్మించాలని డిమాండ్ చేస్తూ పనులు ఆపేశారు. దీంతో SI దివ్య సంఘటన స్థలానికి చేరుకుని ప్రజలకు సర్ది చెప్పారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
JN: ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా తరిగొప్పుల మండలంలోని మరియాపూర్, సోలిపురం, పోతారం గ్రామాల్లో మాదకద్రవ్యాలపై మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నర్మెట్ట సీఐ తరిగొప్పుల ఎస్సై, పోలీస్ సిబ్బందితో పాటు రెవెన్యూ, మెడికల్, పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖల అధికారులు పాల్గొని మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కల్పించారు.
WGL: ఖానాపురం మండలం చిలకమ్మ నగర్ గ్రామంలోని విషాదం చోటు చేసుకుంది. గోవిందు తండాలో తండావాసులు బోనాల పండుగ జరుపుకుంటుండగా మంగళవారం అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు గాయపడ్డారు. స్థానికులు వెంటనే బాధితులను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అలుగునూరులో నిబంధనలు ఉల్లంఘిస్తున్న ‘ఉత్తమ్ ఐస్ క్రీమ్’ తయారీ కేంద్రాన్ని జిల్లా ఆహార భద్రతా విభాగం అధికారులు తనిఖీ చేశారు. ప్యాకింగ్పై చిరునామా, FSSAI లైసెన్స్ నంబర్లు లేకపోవడం, తప్పుడు కేటగిరీలో లైసెన్స్ పొందడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు రూ.6,000 విలువైన స్టాక్ను సీజ్ చేసి లైసెన్స్ పొందాలన్నారు.
కరీంనగర్ హౌసింగ్ బోర్డులోని యజ్ఞ వరాహ స్వామి క్షేత్రంలో యజ్ఞ వరాహ నిర్మాత భాష్యం విజయ సారథి జయంత్యుత్సవం సందర్భంగా అభిషేకం, వేద పారాయణము, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మార్చి 12 నుంచి ప్రతి గురువారం 100 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని ఆలయ కమిటీ తెలిపారు.
KNR: ఆర్టీసీ కరీంనగర్ జోన్ పరిధిలోని బస్ స్టేషన్లు, డిపోలలో ప్రయాణికులకు అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో ఉంచాలని జోన్ ఈడీ పగిడిమర్రి సోలమన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కరీంనగర్ బస్టాండ్ ఆవరణలో సివిల్ ఇంజనీరింగ్ విభాగం అధికారులతో సమీక్ష నిర్వహించారు. పెండింగ్లో ఉన్న మరమ్మతు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, వేసవి దృష్ట్యా ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.
ADB: రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి తనవంతుగా కృషి చేస్తానని MLA పాయల్ శంకర్ అన్నారు. మంగళవారం గుడిహత్నూర్ మండల కేంద్రంలో పర్యటించి రైతులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ, రైతు భరోసాను అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ADB: రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి తనవంతుగా కృషి చేస్తానని MLA పాయల్ శంకర్ అన్నారు. మంగళవారం గుడిహత్నూర్ మండల కేంద్రంలో పర్యటించి రైతులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ, రైతు భరోసాను అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
వరంగల్ కమిషనరేట్ పరిధిలోని సిటీ ఆర్ముడ్ విభాగంలో సిటీ గార్డ్గా విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ వెంకటరెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. కాజీపేట ఫాతిమా జంక్షన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయనకు తీవ్ర గాయాలైయ్యాయి. వెంటనే స్థానికులు చికిత్స కోసం సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు బంధువులు తెలిపారు.
NRPT: కృష్ణ మండలం గూడెబళ్లూరు గ్రామానికి చెందిన పలువురు యువకులు మంగళవారం జనసేన పార్టీలో చేరారు. మక్తల్ ఇంఛార్జ్ డాక్టర్ మణికంఠ గౌడ్ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ ఆశయాలకు ఆకర్షితులై వారు పార్టీ కండువా కప్పుకున్నారు. యువత అంతా కలిసి ప్రజా సమస్యలపై పోరాడి, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఈ సందర్భంగా మణికంఠ గౌడ్ పిలుపునిచ్చారు.
NZB: ప్రతిఒక్కరూ భక్తిభావాన్ని అలవర్చుకోవాలని పీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్కుమార్ గౌడ్ అన్నారు. నిజామాబాద్ నగర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో హనుమాన్ దీక్షా స్వాములకు హనుమాన్ జంక్షన్ ఆలయంలో మంగళవారం అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన పీసీసీ చీఫ్ స్వయంగా హనుమాన్ స్వాములకు వడ్డించారు. వారితో కలిసి భోజనం చేశారు.
NRML: ఈ నెల 12న సారంగాపూర్ మండలం చించోలి (బి) గ్రామంలోని ఆదిత్య గార్డెన్స్లో సర్పంచ్లు, మున్సిపల్ కౌన్సిలర్లకు 99 రోజుల ప్రత్యేక కార్యక్రమంపై అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాలపై ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పిస్తామన్నారు.
NRML: ఈ నెల 12న సారంగాపూర్ మండలం చించోలి (బి) గ్రామంలోని ఆదిత్య గార్డెన్స్లో సర్పంచ్లు, మున్సిపల్ కౌన్సిలర్లకు 99 రోజుల ప్రత్యేక కార్యక్రమంపై అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాలపై ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పిస్తామన్నారు.
MNCL: చదువే మనిషికి జీవం కావాలని, విద్యను ఇష్టపడుతూ చదవాలని పీఎంశ్రీ పాఠశాలల ప్రేరణాత్మక వక్త, రాష్ట్రపతి అంతర్జాతీయ అవార్డు గ్రహీత గుండెటి యోగేశ్వర్ అన్నారు. మంగళవారం జైపూర్ మండలం టేకుమట్ల పీఎంశ్రీ ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థుల కోసం “చదువు.. బడి.. తల్లిదండ్రులు.. పరీక్షలు” అనే అంశంపై నిర్వహించిన అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.