NRPT: జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయంపై ఏసీబీ అధికారులు మెరుపు దాడి చేశారు. ఓ వ్యక్తి నుంచి రూ.25 వేలు లంచం తీసుకుంటుండగా ఆర్డీవో రామచందర్ నాయకు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. డీఎస్పీ బాలకృష్ణ నేతృత్వంలో అధికారులు ఆర్డీవో నివాసం, కార్యాలయంలో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించగా, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
JN: విద్యార్థులకు కంప్యూటర్ పరిజ్ఞానం అందించాలన్న లక్ష్యంతో ఉచిత శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు పాలకుర్తి MLA మామిడాల రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. తొర్రూర్ మండల కేంద్రంలోని తన క్యాంప్ కార్యాలయంలో మంగళవారం MLA ఈ శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. ఆర్థిక ఇబ్బందులతో కోచింగ్ సెంటర్లకు వెళ్లలేని పేద విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
NZB: జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు పిలుపునివ్వడంతో రవాణా వ్యవస్థపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఉమ్మడి జిల్లాలోని 6 డిపోల పరిధిలో రోజూ 647 బస్సులు, 2.50 లక్షల కిలోమీటర్లు ప్రయాణిస్తూ రూ.1.50 కోట్ల ఆదాయాన్నిఆర్జిస్తున్నాయి. సమ్మె జరిగితే ఈ ఆదాయానికి గండి పడటంతో పాటు, నిత్యం ప్రయాణించే వేలాది మందికి రవాణా కష్టాలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
SDPT: నంగునూరులో ఆది శంకరాచార్యుల జయంతి వేడుకలను భక్తులు, యువకులు ఘనంగా నిర్వహించారు. శంకరాచార్యుల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ.. భారతదేశంలో అద్వైత వేదాంతాన్ని ప్రచారం చేసి, ఆధ్యాత్మికతకు నూతన దిశానిర్దేశం చేసిన మహానుభావుడు ఆయన అని కొనియాడారు. సనాతన ధర్మ పరిరక్షణకు ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు.
MNCL: మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను రైతులు వినియోగించుకోవాలని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు సూచించారు. మంగళవారం జన్నారం మండల కేంద్రంలోని మార్కెట్ యార్డు ఆవరణలో ఏర్పాటు చేసిన మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతుల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందని వివరించారు.
BDK: సారపాక ఐటీసీ కర్మాగారంలో జరిగిన ప్రమాదంలో లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఫైర్ పైప్లైన్కు లారీ ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. ముసలమడుగు గ్రామానికి చెందిన వ్యక్తిగా మృతుడిని గుర్తించారు. ఘటనతో పైప్లైన్ పగిలి నీరు ఎగిసి పడుతోంది. మృతుడి బంధువులు ఐటీసీ గేటు ముందు నిరసనకు సిద్ధమవుతుండగా, ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
MDK: రహదారులపై వరి ధాన్యం ఆరబెట్టడం ప్రమాదకరమని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. వరి ధాన్యం ఆరబెట్టడంతో ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందన్నారు. కొంతమంది రైతులు ధాన్యాన్ని రోడ్లపై ఆరబెట్టడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలగడమే కాకుండా ప్రమాదాలకు దారితీస్తోందన్నారు. ధాన్యం చుట్టూ రాళ్లు పెట్టడం, బ్లాక్ కవర్ కప్పడంతో ప్రమాదాలు జరుగుతాయని తెలిపారు.
VKB: ఎండలను మించి నిమ్మకాయల ధరలు మండిపోతున్నాయి. పరిగి మున్సిపల్ మార్కెట్లో ఇవాళ 50 KGల నిమ్మకాయల బస్తా ఏకంగా రూ. 9 వేలు పలుకుతోంది. గతవారం KG రూ.130-రూ.150 ఉండగా, ఇప్పుడు సుమారు రూ. 180 నుంచి రూ. 200కు చేరింది. ఈ ఎండలకు ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు ఎక్కువగా నిమ్మరసాలపై ఆధారపడటంతో వాటికి డిమాండ్ పెరిగినట్లు పలువురు వ్యాపారులు చెబుతున్నారు.
MHBD: కొత్తగూడ మండలంలోని హనుమాన్ ఆలయంలో మంగళవారం హనుమాన్ ఉత్సవ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎస్సై రాజ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎస్ఐ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, హనుమంతుని ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం భక్తులతో కలిసి విగ్రహాన్ని ఆవిష్కరించారు.
SRD: సెన్సస్ ట్రైనింగ్ క్లాసుల సమయాన్ని మార్చాలంటూ TSUTF జిల్లా అధ్యక్షులు అశోక్, ఉపాధ్యక్షులు కాశీనాథ్ జాదవ్ మంగళవారం ఖేడ్లో సబ్ కలెక్టర్ను కలిసి పత్రం సమర్పించారు. అధిక వేడి దృష్ట్యా సెన్సస్ ట్రైనింగ్ క్లాసులు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1:00 వరకు నిర్వహించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. తరగతులను ఈనెల 24 నుంచి ప్రారంభించాలని కోరారు.
జగిత్యాలలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో 2026-27 విద్యాసంవత్సరానికి డిగ్రీ మొదటి సంవత్సరంలో ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ డా. గునుక శ్రీలత తెలిపారు. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతతో పాటు ఆదాయ ప్రమాణాలు వర్తిస్తాయని, బీఎస్సీ, బీకాం (సీఏ), బీఏ కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నారు.
KNR: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎండ తీవ్రతతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. పెద్దపల్లి జిల్లా మల్యాలపల్లిలో 42.8, భోజన్నపేట 42.6 °C, జగిత్యాల జిల్లా గుల్లకోట 42.6, ఐలాపూర్ 42.4°C, కరీంనగర్ జిల్లా జమ్మికుంట, తనుగులలో 41.7°C, రాజన్న సిరిసిల్ల జిల్లా వట్టెంల 41.3, ఇల్లంతకుంటలో 41.0°C నమోదయ్యాయి.
SRPT: కోదాడ నియోజకవర్గంలోని అనంతగిరి మండలం శాంతినగర్ హాస్టల్ను ఎంపీడీవో హరి సింగ్ తనిఖీ చేశారు. హాస్టల్లో పరిశుభ్రత, భోజన నాణ్యత, తాగునీటి సౌకర్యం, వంటగది, భోజనశాల, నిద్ర గదులు వంటి వసతులను ఆయన పరిశీలించారు. విద్యార్థులకు అందుతున్న సదుపాయాల గురించి ఎంపీడీవో అడిగి తెలుసుకున్నారు.
MBNR: రైతులు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం నాయనోనిపల్లిలో మహిళా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. సన్నరకం వరి ధాన్యానికి తమ ప్రభుత్వం రూ. 500 బోనస్ అందిస్తోందని, రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.
MNCL: ఏడీసీసీ సహకార బ్యాంక్ జన్నారం శాఖ నూతన మేనేజర్ గా శ్రీనివాస్ బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఇన్ఛార్జ్ మేనేజర్గా పనిచేస్తున్న రాజేష్ బదిలీపై వెళ్తున్నారు. దీంతో కొత్తగా వచ్చిన, బదిలీపై వెళ్తున్న మేనేజర్లను మంగళవారం ఏడీసీసీ బ్యాంకు కార్యాలయంలో ఖాతాదారులు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు ఖాతాదారులకు మంచి సేవలు అందించాలని కోరారు.