• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

మైనర్లకు పొగాకు విక్రయిస్తే కఠిన చర్యలు: సీఐ

NZB: 18 ఏళ్ల లోపు మైనర్లకు పొగాకు ఉత్పత్తులు విక్రయించడం చట్టరీత్యా నేరమని బోధన్ రూరల్ సీఐ విజయ్ బాబు హెచ్చరించారు. సాలూరలోని కిరాణా దుకాణాల వద్ద ఆయన పోలీసు సిబ్బందితో కలిసి అవగాహన పోస్టర్లను అంటించారు. నిబంధనలు ఉల్లంఘించే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి దుకాణం వద్ద తప్పనిసరిగా నిషేధిత హెచ్చరిక బోర్డులు ఉండాలని స్పష్టం చేశారు.

April 6, 2026 / 07:55 PM IST

ట్రాన్స్ జెండర్లకు చెక్కుల పంపిణీ

KMR: ఆర్థిక పునరావాస పథకం కింద జిల్లాలోని ఇద్దరు ట్రాన్స్ జెండర్లకు కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సోమవారం చెక్కులను అందజేశారు. ఒక్కొక్కరికి రూ.75,000 చొప్పున మంజూరైన ఈ సాయం తమకు ఎంతో బలం చేకూరుస్తుందని లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి ఏ.ప్రమీల, సూపరింటెండెంట్ అరుణ్ భాస్కర్ పాల్గొన్నారు.

April 6, 2026 / 07:49 PM IST

‘రైతులకు అందుబాటులోకి ధాన్యం కొనుగోలు కేంద్రం’

నల్లగొండ మండలం వెలుగుపల్లిలో డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్ పోతేపాక వినోద్ కుమార్, ఉపసర్పంచ్ జూలకంటి పద్మ, మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ జూలకంటి వెంకట్ రెడ్డిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని సూచించారు.

April 6, 2026 / 07:45 PM IST

‘వెంటనే వరి బోనస్ను విడుదల చేయాలి’

BHPL: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో సన్నవల పంటలకు క్వింటాల్‌కు రూ. 500 బోనస్ ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పటివరకు అమలు చేయకపోవడం దురదృష్టకరమని విమర్శించారు. గడువులోగా పరిష్కారం కాకపోతే టీఆర్పీ ఆధ్వర్యంలో భారీ ధర్నా చేపడుతామని హెచ్చరించారు.

April 6, 2026 / 07:40 PM IST

ప్రజావాణిలో 57 అర్జీలు

BHNG: ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పెండింగ్ లేకుండా సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. సోమవారం ప్రజావాణిలో రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకా రెడ్డితో కలిసి వివిధ ప్రాంతాల ప్రజల నుంచి వచ్చిన 57 అర్జీలను స్వీకరించారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సంబంధిత అధికారులు పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరించాలని అన్నారు.

April 6, 2026 / 07:40 PM IST

కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన పాలకుర్తి ఎమ్మెల్యే

JN: పాలకుర్తిలోని మార్కెట్ యార్డులో మక్కల కొనుగోలు కేంద్రాన్ని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ… పాలకుర్తి ప్రాంత ప్రజలు ఈ కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని, రైతు దేశానికి వెన్నెముక అని, రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీ చేశామని, రైతు భరోసా నిధులను విడుదల చేసినట్లు తెలిపారు.

April 6, 2026 / 07:30 PM IST

అర్హులందరికీ సంక్షేమ పథకాలు చేరాలి: కలెక్టర్

MDK: జిల్లాలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాలను పక్కాగా అమలు చేయాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేసి, నివేదికలను త్వరితగతిన అందించాలన్నారు.

April 6, 2026 / 07:30 PM IST

కాంగ్రెస్ నేతలు అసంతృప్తితో ఉన్నారు: మాజీ మంత్రి

MBNR: మహబూబ్ నగర్ కాంగ్రెస్ నేతలు అసంతృప్తితో ఉన్నారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నేతలను డబ్బులు, వ్యాపార వెసులుబాటు ఆశచూపి ప్రలోభాలకు గురిచేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముందుగా తమ పార్టీలోని అసంతృప్త నేతలను సరిదిద్దుకోవాలని ఆయన సూచించారు. పోలీసులు, అధికార బలంతో పార్టీ మార్పిడిలు సరికాదన్నారు.

April 6, 2026 / 07:30 PM IST

శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలి: MPDO

NZB: మోపాల్ రైతు వేదికలో వార్డ్ మెంబర్స్ శిక్షణ తరగతులు సోమవారం ప్రారంభమయ్యాయి. ఎంపీడీవో రాములు నాయక్ మాట్లాడుతూ.. ఐదు రోజులపాటు జరిగే శిక్షణ తరగతులు గ్రామ పంచాయతీకి వార్డ్ మెంబర్లు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వార్డు సభ్యులు తమ విధులు, హక్కులు, గ్రామ అభివృద్ధిలో వారి పాత్రపై స్పష్టమైన అవగాహన పెంపొందించుకోవడం ఈశిక్షణ తరగతులు ఉపయోగపడతాయన్నారు.

April 6, 2026 / 07:29 PM IST

అంబేద్కర్ ఉత్సవ కమిటీ ఛైర్మన్‌గా జన్ను రవి

MLG: అంబేద్కర్ జయంతి ఉత్సవాల నేపథ్యంలో జిల్లా అంబేద్కర్ ఉత్సవ కమిటీ ఛైర్మన్‌గా జన్ను రవి నియమితులయ్యారు. జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్‌ను కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి బొకే, శాలువాతో సత్కరించారు. ఈ నెల 14న జరిగే అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. జిల్లా ఎస్సీ అధికారి కొమురయ్యను కమిటీ సభ్యులు సత్కరించారు.

April 6, 2026 / 07:25 PM IST

సీఎంకు ఛైర్‌పర్సన్ వినతి

ఆదిలాబాద్ పట్టణాభివృద్ధికి తగిన విధంగా నిధులు కేటాయించి సహకరించాలని ఆదిలాబాద్ మున్సిపల్ ఛైర్‌పర్సన్ బండారి అనూష, అసెంబ్లీ ఇంఛార్జ్ కంది శ్రీనివాస రెడ్డి కోరారు. ఈ విషయమై సోమవారం బజార్హత్నూర్ మండలం పిప్రిలో సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. అభివృద్ధికి కావలసిన నిధులు పూర్తి నివేదిక అందించారు.

April 6, 2026 / 07:25 PM IST

ఇందిరమ్మ గృహ ప్రవేశాలకు హాజరైన ఎమ్మెల్యే

KNR: మానకొండూర్ మండలం లలితాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ గృహ ప్రవేశ కార్యక్రమాలకు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ హాజరయ్యారు. గ్రామానికి చెందిన దాడి మమత-లక్ష్మణ్, వేల్పుల అయిలమ్మ, కాల్వ రమ్య-సతీష్‌లకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా, వారు ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకుని సోమవారం గృహప్రవేశాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

April 6, 2026 / 07:20 PM IST

‘పారదర్శకంగా ప్రజలకు లబ్ధి జరగాలి’

KMM: పాలన ద్వారా ప్రజలకు పారదర్శకంగా లబ్ధి జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అనుదీప్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్‌రేట్‌లో జిల్లా అధికారులతో సమీక్ష జరిపారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో నమోదు అవుతున్న సిబ్బంది హాజరును పరిశీలించి, తక్కువ సిబ్బంది హాజరు నమోదు ఉన్న ప్రభుత్వ శాఖల అధికారులు కారణాలతో కూడిన వివరణ సమర్పించాలని ఆదేశించారు.

April 6, 2026 / 07:20 PM IST

హాస్పిటల్‌ను సందర్శించిన డిప్యూటీ డీఎంహెచ్ఓ

KMR: ఇస్లాంపుర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ రాంరెడ్డి తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని రికార్డులు, రిజిస్టర్లను క్షుణ్ణంగా పరిశీలించారు. జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలులో సిబ్బంది మరింత చురుగ్గా వ్యవహరించాలని సూచించారు. ముఖ్యంగా వేసవి తీవ్రత దృష్ట్యా ప్రజలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని కోరరు.

April 6, 2026 / 07:19 PM IST

‘ధాన్యం కొనుగోళ్ల‌ను వెంటనే ప్రారంభించాలి’

BHNG: రామన్నపేట మండల సీపీఐ కార్యాలయంలో ఇవాళ రైతు సంఘం మండల మహాసభ నిర్వహించారు. ఈ సమావేశానికి తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేక అశోక్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించి గత లోపాలను సరిదిద్దుకుని రైతాంగానికి నష్టం వాటిల్లకుండా చూడాలని డిమాండ్ చేశారు.

April 6, 2026 / 07:19 PM IST